జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు ప్రారంభం

ABN , First Publish Date - 2020-07-01T11:31:31+05:30 IST

జడ్పీ స్థాయీ సంఘం సమావేశాలు చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అధ్యక్షతన మంగళవారం ప్రారంభమయ్యాయి

జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు ప్రారంభం

ఖిల్లా, జూన్‌ 30: జడ్పీ స్థాయీ సంఘం సమావేశాలు చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అధ్యక్షతన మంగళవారం ప్రారంభమయ్యాయి. ముందు గా జడ్పీ హాల్‌లో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తర్వాత చైర్మన్‌ సమావేశాలను ప్రారంభి ంచారు. తొలిరోజు హరితహారం, పారిశుద్ధ్య కార్యక్రమాలు, గ్రామీణాభివృ ద్ధి, వ్యవసాయ కమిటీ సమావేశాలను నిర్వహించారు. ఈ సమావేశాల్లో పలు అంశాలను చర్చించారు. పనులను త్వరగా పూర్తిచేయాలని చైర్మన్‌ అధికారులను ఆదేశించారు. లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని కోరారు. ఈ సమావేశంలో జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ రజితా యాదవ్‌, సీఈవో గోవిం ద్‌, జడ్పీటీసీలు సుమలత, మాన్‌సింగ్‌, నారోజి, కోఆప్షన్‌ సభ్యులు మోయి జ్‌, డీపీవో జయసుధ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-01T11:31:31+05:30 IST