‘బాబ్రీ’ తీర్పు చెప్పిన న్యాయమూర్తికి ఉప లోకాయుక్త పదవి
ABN , First Publish Date - 2021-04-13T01:13:59+05:30 IST
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు వెల్లడించిన రిటైర్డ్ జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్ను ఉత్తరప్రదేశ్
లక్నో: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు వెల్లడించిన రిటైర్డ్ జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘ఉప లోకాయుక్త’గా నియమించింది. ఏప్రిల్ 6న గవర్నర్ ఆయనను మూడో ఉప లోకాయుక్తగా నియమించారని, లోకాయుక్త సంజయ్ మిశ్రా సమక్షంలో నేడు ఆయన ప్రమాణస్వీకారం చేశారని ప్రభుత్వం తెలిపింది.
సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అయిన యాదవ్ సెప్టెంబరు 30న బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సంచలన తీర్పు వెలువరించారు. బీజేపీ యోధుడు ఎల్కే అద్వానీ సహా ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న 32 మందిని నిర్దోషులుగా ప్రకటించారు.