డీటాక్స్‌ చేద్దామా...

ABN , First Publish Date - 2020-11-25T17:33:30+05:30 IST

ఒంట్లో వ్యర్థాలు, విషపదార్థాలు పేరుకుపోయినప్పుడు నీరసంగా, బద్ధకంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు కీరదోస, తులసితో తయారుచేసిన జ్యూస్‌ తాగితే ఒంట్లోని విషపదార్థాలు బయటకు వెళతాయి. శరీరం సత్తువను పొందుతుంది.

డీటాక్స్‌ చేద్దామా...

ఆంధ్రజ్యోతి(25-11-2020)

ఒంట్లో వ్యర్థాలు, విషపదార్థాలు పేరుకుపోయినప్పుడు  నీరసంగా, బద్ధకంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు కీరదోస, తులసితో తయారుచేసిన జ్యూస్‌ తాగితే ఒంట్లోని విషపదార్థాలు బయటకు వెళతాయి. శరీరం సత్తువను పొందుతుంది. 


కావలసినవి: కీరదోసకాయలు- రెండు, తులసి ఆకులు- 10 లేదా 12, తేనె లేదా నిమ్మరసం- రెండు టేబుల్‌ స్పూన్లు, దాల్చిన చెక్క పొడి- చిటికెడు, సగం గ్లాసు నీళ్లు


తయారీ విధానం: ముందుగా కీరదోస పొట్టు తీసి, ముక్కలుగా కోయాలి. వీటిలో తులసి ఆకులు, నీళ్లు, దాల్చిన చెక్క పొడి వేసి మిక్సీ పట్టుకోవాలి. జ్యూస్‌ తయారయ్యాక తేనె లేదా నిమ్మరసం కలిపి తాగాలి.


Updated Date - 2020-11-25T17:33:30+05:30 IST