30 వేల కోట్లకు పైగా పెరిగిన జీఎస్‌టీ కలక్షన్లు!

ABN , First Publish Date - 2020-07-02T05:25:53+05:30 IST

జూన్ నెలలో జీఎస్‌టీ పన్ను కలక్షన్లు రికార్డు స్థాయిలో రూ. 90,917 వేల కొట్లకు చేరుకున్నాయి.

30 వేల కోట్లకు పైగా పెరిగిన జీఎస్‌టీ కలక్షన్లు!

న్యూఢిల్లీ: జూన్ నెలలో జీఎస్‌టీ పన్ను కలక్షన్లు రికార్డు స్థాయిలో రూ. 90,917 వేల కొట్లకు చేరుకున్నాయి. మే నెలలో కేవలం రూ. 62,009  కోట్లుగా ఉన్న పన్ను వసూళ్లకు ఒక్క నెలలో దాదాపు 30 వేల కోట్ల రూపాయల మేర పెరిగాయి. మే నెలలోనూ దాదాపు ఇదే స్థాయిలో పన్ను వసూళ్ల పెరుగుదల నమోదైందని కేంద్రం తెలిపింది.  ఏప్రిల్ నెలల దాదాపు రూ. 32 వేల కోట్లుగా ఉన్న పన్ను వసూళ్లు జరిగాయని పేర్కొంది. ఆంక్షల సడలింపు కారణంగా ఆర్థిక వ్యవస్థ పరిగెడుతుండటంతో పన్ను వసూళ్లూ కొంత మేర పెరుగుతున్నాయి. అయితే జూన్ నెల కలక్షన్లలో ఫిబ్రవరి, మార్చి నెల నాటి బకాయిల చెల్లింపులు కూడా ఉన్నాయని ఆర్థిక శాఖ తెలిపింది. కరోనా సమయంలో పన్ను చెల్లింపుదారులకు ఇచ్చిన వెసులుబాటు కారణంగా బకాయిల వసూలు వాయిదా పడిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-07-02T05:25:53+05:30 IST