మనోళ్లు గెలవాల్సిందే!

ABN , First Publish Date - 2021-11-27T08:55:44+05:30 IST

జూనియర్‌ వరల్డ్‌ కప్‌ హాకీ టోర్నీ డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ శనివారం జరిగే చావోరేవో మ్యాచ్‌లో పోలెండ్‌ను ఢీకొననుంది.

మనోళ్లు గెలవాల్సిందే!

జూనియర్‌ హాకీ వరల్డ్‌ కప్‌ 


భువనేశ్వర్‌: జూనియర్‌ వరల్డ్‌ కప్‌ హాకీ టోర్నీ డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ శనివారం జరిగే చావోరేవో మ్యాచ్‌లో పోలెండ్‌ను ఢీకొననుంది. పూల్‌ ‘బి’లో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న భారత్‌ క్వార్టర్‌ఫైనల్‌ చేరాలంటే పోలెండ్‌పై పోరులో తప్పక నెగ్గాల్సి ఉంటుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో జర్మనీ 3-2తో అర్జెంటీనాపై, హాలెండ్‌ 3-2తో స్పెయిన్‌పై గెలుపొందాయి. ఇతర మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా 5-1తో చిలీని, కొరియా 5-1తో అమెరికాని ఓడించాయి. బెల్జియం-మలేసియా మధ్య పోరు 1-1తో డ్రా అయింది. 

Updated Date - 2021-11-27T08:55:44+05:30 IST