జూనియర్‌ లాయర్లకు సాయం చేయాలి: రాంచందర్‌రావు

ABN , First Publish Date - 2020-04-09T09:55:08+05:30 IST

కరోనా నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న జూనియర్‌ లాయర్లను ప్రభుత్వమే ఆదుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు. న్యాయవాదుల ట్రస్టుకు కేటాయించిన రూ.100కోట్లపై వచ్చే

జూనియర్‌ లాయర్లకు సాయం చేయాలి: రాంచందర్‌రావు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న జూనియర్‌ లాయర్లను ప్రభుత్వమే ఆదుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు. న్యాయవాదుల ట్రస్టుకు కేటాయించిన రూ.100కోట్లపై వచ్చే వడ్డీతో వారికి సా యం చేయాలని సీఎం కేసీఆర్‌కు బుధవారం లేఖ రాశారు. తెలంగాణలో మొత్తం 50 వేల మంది న్యాయవాదులు ప్రాక్టీస్‌ చేస్తుండగా, వీరి లో 40శాతం జూనియర్‌ న్యాయవాదులేనని ఆయన తెలిపారు. వీరిలో చాలామంది అద్దె ఇళ్లల్లో ఉంటున్నారన్నారు.

Updated Date - 2020-04-09T09:55:08+05:30 IST