ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు
ABN , First Publish Date - 2020-05-21T10:06:06+05:30 IST
జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను బుధవారం టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిరు. తెలుగుయువత నాయకులు నల్లమల
250మందికి నిత్యావసరాల పంపిణీ
ఖమ్మం మామిళ్లగూడెం, మే-20: జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను బుధవారం టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిరు. తెలుగుయువత నాయకులు నల్లమల రంజిత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు ముఖ్యతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నగరంలో వివిధ హోటళ్లలో పనిచేస్తున్న 250మంది వంట మేస్ర్తీలకు 5కేజీల బియ్యంతో పాటు నిత్యావసరాలు, కూరగాయలను పంపిణీ చేశారు.
ఆ తర్వాత పార్టీ కార్యాలయం ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కేతినేని హరీష్, గుత్తాసీతయ్య, కొండబాల కరుణాకర్, నాగార్జునపు శ్రీను, కృష్ణప్రసాద్, మోహన్ నాగేశ్వరరావు, కన్నేటి పృద్వి, సుబ్బారావు, నాగదాసరి, సాయితేజ, శంకర్, రవి సాయి తదితరులు పాల్గొన్నారు.