బాధను ఎలా వ్యక్తపరచాలో మాటలు రావడం లేదు: జూ.ఎన్టీఆర్

ABN , First Publish Date - 2021-12-01T16:31:11+05:30 IST

ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నటుడు జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు.

బాధను ఎలా వ్యక్తపరచాలో మాటలు రావడం లేదు: జూ.ఎన్టీఆర్

హైదరాబాద్: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నటుడు జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. ఫిలింఛాంబర్‌లో సిరివెన్నెల పార్ధివదేహాన్ని సందర్శించి అంజలి ఘటించారు. అనంతరం జూ.ఎన్టీఆర్ మాట్లాడుతూ...బాధను ఎలా వ్యక్తపరచాలో కూడా మాటలు రావడం లేదని... అలాంటి మాటలను వర్ణించడంలో కూడా ఆయనే అని తెలిపారు. తెలుగు జాతి, భాష బతికున్నంత కాలం ఆయన సాహిత్యం బతికి ఉంటుందన్నారు. తెలుగు చలన చిత్రసీమకు ఆయన ఆశీస్సులు ఉండాలని అన్నారు. ఆయన పాటలు రాబోయే తరాలకు బంగారు బాటలని చెప్పారు. సిరివెన్నెల సీతారామాశాస్త్రి ఆత్మకు శాంతి కలగాలని జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్షించారు. 

Updated Date - 2021-12-01T16:31:11+05:30 IST