భూమిపూజ ముహూర్తం 32 సెకండ్లే...

ABN , First Publish Date - 2020-08-04T20:37:29+05:30 IST

అయోధ్యలో రామాలయ నిర్మాణం భూమిపూజ కోసం సోమవారం నుంచే సంబరాలు, సన్నాహాలు మొదలైనప్పటికీ ..

భూమిపూజ ముహూర్తం 32 సెకండ్లే...

న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయ నిర్మాణం భూమిపూజ కోసం సోమవారం నుంచే సంబరాలు, సన్నాహాలు మొదలైనప్పటికీ భూమిపూజ ముహూర్త సమయం మాత్రం కొద్ది సెకన్లేనట. శుభ ఘడియ కేవలం కొద్ది సెకన్లేనని అర్చకులు, మత పెద్దలు చెబుతున్నారు. వారు చెబుతున్న ప్రకారం ముహూర్తం (శుభ ఘడియలు) 32 సెకన్లేనట. అంటే ఆ 32 సెకండ్లలోనే మోదీ భూమిపూజ పూర్తి చేస్తారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 08 సెకన్లకు ముహూర్తం ప్రారంభమై, 12 గంటల 44 నిమిషాల 40 సెక్షన్లకు పూర్తవుతుంది.


వేదికపై ఐదుగురే...


మొత్తం 175 మంది అతిథుల్లో (ఆహ్వానితులు) 135 మంది వివిధ సాంప్రదాయాలకు చెందిన సాధువులు ఉన్నారు. అయితే ఐదుగురు మాత్రమే వేదికపై ఉంటారు. వారిలో ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ట్రస్టు చీఫ్ నృత్య గోపాల్‌దాస్ మహరాజ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. కోవిడ్-19 నేపథ్యంలో సెక్యూరిటీ ప్రోటోకాల్ అమల్లో ఉంటుంది.


Updated Date - 2020-08-04T20:37:29+05:30 IST