ప్రతి రైతుకు న్యాయం చేస్తాం
ABN , First Publish Date - 2021-06-19T01:49:14+05:30 IST
చెన్నై-బెంగుళూరు కోస్టల్ కారిడార్కు భూములు కోల్పోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లిస్తామని గూడూరు ఇన్చార్జి సబ్ కలెక్టర్, జేసీ బాపిరెడ్డి ప్రకటించారు.
కోట, జూన్ 18 : చెన్నై-బెంగుళూరు కోస్టల్ కారిడార్కు భూములు కోల్పోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లిస్తామని గూడూరు ఇన్చార్జి సబ్ కలెక్టర్, జేసీ బాపిరెడ్డి ప్రకటించారు. గోవిందుపల్లి, వావిళ్లదొరువు, శ్రీనివాసపురం, కొత్తపట్నం గ్రామాల్లో బాపిరెడ్డి శుక్రవారం ఆయన పర్యటించి. రైతులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. కొత్తపట్నం పంచాయతీలో 9.05 ఎకరాలు మాత్రమే కోస్టల్ కారిడార్కు సేకరించాన్నారు. ఆ భూముల రైతులకు పరిహారం చెల్లిస్తామన్నారు. చిల్లకూరు, కోట మండలాల్లోని 2500 ఎకరాలకు చెందిన రైతులకు 15 రోజుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం పరిహారం అందిస్తామన్నారు. ఆర్ఐ సతీష్, వీఆర్వోలు పాల్గొన్నారు.