ప్రధాని మోదీతోనే ఓబీసీలకు న్యాయం

ABN , First Publish Date - 2021-08-03T06:33:25+05:30 IST

దేశంలో ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్‌ కల్పించి వారి చిరకాల ఆకాంక్షను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నెరవేర్చారని ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు బి.శివనారాయణ అన్నారు.

ప్రధాని మోదీతోనే ఓబీసీలకు న్యాయం
సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శివనారాయణ

ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శివనారాయణ


మదనపల్లె రూరల్‌, ఆగష్టు 2: దేశంలో ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్‌ కల్పించి వారి చిరకాల ఆకాంక్షను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నెరవేర్చారని  ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు బి.శివనారాయణ అన్నారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాలులో ఓబీసీ మోర్చా రాజంపేట జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టీని బలోపేతం చేయడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు సుబ్బారెడ్డి మాట్లాడుతూ... కేంద్రప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యల్లంపల్లె ప్రశాంత్‌, జర్మన్‌ రాజు, కిరణ్‌, రేవతి, నాగిరెడ్డి, శివప్రసాద్‌, బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-03T06:33:25+05:30 IST