కనకమహాలక్ష్మిని దర్శించుకున్న జస్టిస్‌ నాగార్జునరెడ్డి

ABN , First Publish Date - 2022-01-28T05:03:16+05:30 IST

బురుజుపేటలో కొలువుదీరిన కనకమహాలక్ష్మి అమ్మవారిని ఏపీ ఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ నాగార్జున రెడ్డి గురువారం దర్శించుకున్నారు.

కనకమహాలక్ష్మిని దర్శించుకున్న జస్టిస్‌ నాగార్జునరెడ్డి
అమ్మవారి సన్నిధిలో జస్టిస్‌ నాగార్జునరెడ్డి దంపతులు

విశాఖపట్నం, జనవరి 27: బురుజుపేటలో కొలువుదీరిన కనకమహాలక్ష్మి అమ్మవారిని ఏపీ ఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ నాగార్జున రెడ్డి గురువారం దర్శించుకున్నారు. ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి వి.రాంబాబు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి విశేష పూజల అనంతరం వేదాశీర్వచనం నిర్వహించి ప్రసాదం అందజేశారు.

Updated Date - 2022-01-28T05:03:16+05:30 IST