జగన్ చాలా మొండివాడు: జ్యోతుల నెహ్రూ
ABN , First Publish Date - 2020-06-07T00:53:52+05:30 IST
ఏపీలో వనరుల్ని ఎలా దోచుకోవాలో సీఎం జగన్కు పూర్తి అవగాహన ఉందని టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ విమర్శించారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు దోచుకుని.. ఇప్పుడు కేసులను ఎదుర్కొంటున్నారని ఎద్దేవాచేశారు.
అమరావతి: ఏపీలో వనరుల్ని ఎలా దోచుకోవాలో సీఎం జగన్కు పూర్తి అవగాహన ఉందని టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ విమర్శించారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు దోచుకుని.. ఇప్పుడు కేసులను ఎదుర్కొంటున్నారని ఎద్దేవాచేశారు. ఎవరు చెప్పినా సీఎం జగన్ వినడం లేదని, అందుకే వైసీపీ ఎమ్మెల్యేలు బాధను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. జగన్ చాలా మొండివాడు.. తాను అనుకున్నదే నిజం అని నమ్ముతాడని ఆరోపించారు. వ్యాపారస్తుడిలా జగన్ వ్యవహరిస్తున్నారని జ్యోతుల నెహ్రూ దుయ్యబట్టారు.