హైదరాబాద్‌లో వ్యభిచార రాకెట్‌ గుట్టు రట్టు

ABN , First Publish Date - 2021-04-30T13:39:42+05:30 IST

: మనుషుల అక్రమ రవాణా, వ్యభిచార రాకెట్‌ను గుట్టు రట్టు చేశారు పోలీసులు.

హైదరాబాద్‌లో వ్యభిచార రాకెట్‌ గుట్టు రట్టు

  • నిర్వాహకుడి అరెస్టు
  • ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌, మూడు ఫోన్లు, 2 క్యామ్‌ సెల్ఫీ స్టాండ్స్‌ స్వాధీనం

హైదరాబాద్/కొత్తపేట : మనుషుల అక్రమ రవాణా, వ్యభిచార రాకెట్‌ను గుట్టు రట్టు చేశారు పోలీసులు. నిర్వాహకుడిని అరెస్టు చేసి ముగ్గురు మహిళలను రక్షించారు. నిందితుడి నుంచి ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌, మూడు ఫోన్లు, 2 క్యామ్‌ సెల్ఫీ స్టాండ్స్‌ స్వాధీనం చేసుకున్నారు.  


డేటింగ్‌ యాప్‌ ముసుగులో..

ఎల్‌బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ ఇంట్లో ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు రాచకొండ యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌(ఏహెచ్‌టీయూ)టీమ్‌కు సమాచారం అందింది. వారు ఎల్‌బీనగర్‌ పోలీసుల సహకారంతో బుధవారం రాత్రి ఆ ఇంటిపై దాడి చేశారు. పశ్చిమ బెంగాల్‌ ఖానాపూర్‌, సేన్‌పూర్‌కు చెందిన దేబ్‌జ్యోతిదాస్(27)ను అదుపులోకి తీసుకున్నారు. ఇతడు కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. బీఎస్సీ, ఎలకా్ట్రనిక్స్‌లో పీజీ చేశాడు. 2016లో నాగోల్‌లో వ్యభిచారం నిర్వహిస్తూ అరెస్టయ్యాడు. 2018లో బెయిల్‌పై విడుదలయ్యాడు. అప్పటి నుంచి నాగోల్‌ ఫతుల్లగూడ, శివపురి కాలనీలో అద్దె ఇంట్లో కుటుంబంతో ఉంటూ వెబ్స్‌ ఇయోటిప్‌ గ్యాన్‌ పేరిట వెబ్‌ డిజైనింగ్‌ యూ ట్యూబ్‌ చానెల్‌ నిర్వహిస్తున్నాడు.


ఆర్థిక సమస్యలు అధిగమించడానికి.. 

లాక్‌డౌన్‌ కారణంగా ఎదురైన ఆర్థిక సమస్యలను అధిగమించడానికి  అక్రమంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. గతంలో పరిచయం ఉన్న మహిళలతో కలిసి వ్యభిచారం నిర్వహించాలని భావించాడు. కోల్‌కతా, ముంబై తదితర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొస్తున్నాడు. వారు గ్రౌండ్‌ఫ్లోర్‌లో  ఉండేలా ఏర్పాటు చేశాడు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు, మహారాష్ట్రకు చెందిన మహిళను నగరానికి తీసుకొచ్చాడు. 


గత ఏడాది నుంచి ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్‌ లొకాంటో పేరిట ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. అందమైన యువతుల అర్ధనగ్న ఫొటోలను అప్‌లోడ్‌ చేస్తూ, లైవ్‌ క్యామ్‌ సెక్స్‌ సర్వీస్‌ అందుబాటులో ఉందని, విటులు సంప్రదించడానికి తన ఫోన్‌ నెంబర్లను యాప్‌లో పోస్ట్‌ చేస్తున్నాడు. హార్డ్‌ కోర్‌ క్యామ్‌ సెక్స్‌ షో లైవ్‌ బై హైదరాబాదీ అని ఫోస్టు చేసి ఆన్‌లైన్‌లో విటులను ఆకర్షిస్తున్నాడు. తనను సంప్రదించిన వారి నుంచి ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా డబ్బు వసూలు చేస్తాడు. ఒక్కొక్కరి నుంచి రూ. 2 వేల నుంచి రూ. 15 వేలు వసూలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని రిమాండ్‌కు తరలించామని ఏహెచ్‌టీయూ ఇన్‌స్పెక్టర్‌ కె. చంద్రశేఖర్‌, ఎల్‌బీనగర్‌ ఎస్‌హెచ్‌వో వి. అశోక్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-04-30T13:39:42+05:30 IST