ఎప్పటికప్పడు వెబ్సైట్లో వారి వివరాలు వెల్లడిపరుస్తా: ఎన్నికల ప్రధాన అధికారి
ABN , First Publish Date - 2022-01-06T00:31:12+05:30 IST
రాష్ట్రంలో మోత్తం ఓటర్లను సంఖ్యను తెలియజేస్తూ నూతన జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె విజయానంద్ విడుదల చేశారు.
అమరావతి: రాష్ట్రంలో మోత్తం ఓటర్లను సంఖ్యను తెలియజేస్తూ నూతన జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె విజయానంద్ విడుదల చేశారు. వివిధ రాజకీయ పార్టీలకు, డిఇవోలకు రేపు జరిగే సమావేశంలో నూతన ఓటర్ల జాబితా అందజేస్తామని సిఇవో పేర్కొన్నారు. ప్రతినెల సవరణలు, తోపాటు కొత్త ఓటర్లు చేరిక, తోలగింపు కొనసాగుతుందని వెల్లడించారు. ఎప్పటికప్పడు వెబ్సైట్లో వారి వివరాలు వెల్లడిపరుస్తామని తెలిపారు. ఫైనల్ జాబితా ప్రకారం రాష్ట్రంలో 4కోట్ల 6లక్షల 68వేల986 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త ఓటర్ల జాబితా ప్రకారం 67వేల 935మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్టు వెల్లడించారు.