కబడ్డీ చాంపియన్ వైజాగ్ వారియర్స్
ABN , First Publish Date - 2021-10-18T06:16:43+05:30 IST
ల్లా కబడ్డీ సంఘం నిర్వహించిన సీఎం కప్ కబడ్టీ టోర్నీలో వైజాగ్ వారియర్స్ చాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అల్లూరి యూత్ రన్నరప్గా నిలిచింది.
విశాఖపట్నం(స్పోర్ట్సు), అక్టోబరు 17: జి
ల్లా కబడ్డీ సంఘం నిర్వహించిన సీఎం కప్ కబడ్టీ టోర్నీలో వైజాగ్ వారియర్స్ చాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అల్లూరి యూత్ రన్నరప్గా నిలిచింది. స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్స్లో వైజాగ్ వారియర్స్ 41-07 స్కోరు తేడాతో అల్లూరి యూత్పై ఘన విజయం సాధించి చాంపియన్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో వైజాగ్ వారియర్స్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టోర్నీ ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర కబడ్డీ సంఘం సంయుక్త కార్యదర్శి ఉరుకూటి శ్రీనివాసరావు, అంతర్జాతీయ కబడ్డీ కోచ్ ఉమాశంకరబాబు, జాతీయ ఆటగాడు మళ్ల గణపతి, దాసు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.