కబడ్డీ విజేతలు తూర్పుగోదావరి, కృష్ణా
ABN , First Publish Date - 2022-01-17T07:01:45+05:30 IST
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల విజేతలుగా తూర్పుగోదావ రి, కృష్ణా జిల్లాల జట్లు నిలిచాయి. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు పీవీఆర్ క్రీ డా మైదానంలో ఈనెల 12 నుంచి జరిగిన రాష్ట్ర స్థాయి బాల,బాలికల కబడ్డీ పోటీలు శనివారం ముగిశాయి.
రన్నర్స్గా గుంటూరు, శ్రీకాకుళం
బహుమతులను ప్రదానం చేసిన మంత్రి బాలినేని
ఒంగోలు(కార్పొరేషన్), జనవరి 16 : రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల విజేతలుగా తూర్పుగోదావ రి, కృష్ణా జిల్లాల జట్లు నిలిచాయి. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు పీవీఆర్ క్రీ డా మైదానంలో ఈనెల 12 నుంచి జరిగిన రాష్ట్ర స్థాయి బాల,బాలికల కబడ్డీ పోటీలు శనివారం ముగిశాయి. స్థానిక పీవీఆర్ క్రీడామైదానంలో నా లుగు రోజులపాటు పోటీలు జరిగాయి. హోరా హోరీగా సాగిన ఈ పోటీల్లో బాలుర విభాగంలో తూర్పు గోదావరి జట్టు ప్రథమస్థానంలో గెలు పొందగా, గుంటూరు జట్టు ద్వితీయ స్థానం, కృ ష్ణా, నెల్లూరు జట్లు తృతీయ స్థానంలో నిలిచాయి. అదేవిధంగా బాలికల విభాగంలో కృష్ణా జట్టు ప్రథమస్థానంలో నిలవగా, శ్రీకాకుళం జట్టు ద్వితీ య స్థానంలో, విశాఖపట్నం, నెల్లూరు జట్లు తృతీ య స్థానంలో నిలిచాయి. ఈ సందర్బంగా విజేత లకు రాష్ట్ర అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి బహుమతలను ప్రదానం చేశారు.