తెల్లాపూర్‌లో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు

ABN , First Publish Date - 2021-01-21T06:56:30+05:30 IST

రామచంద్రాపురం మండల పరిధి తెల్లాపూర్‌లో కాల్వగడ్డ రాజ్‌కుమార్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 25, 26వ తేదీల్లో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామని

తెల్లాపూర్‌లో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు

రామచంద్రాపురం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): రామచంద్రాపురం మండల పరిధి తెల్లాపూర్‌లో కాల్వగడ్డ రాజ్‌కుమార్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 25, 26వ తేదీల్లో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు గట్టుపల్లి పాండు, భానూరి రాజిరెడ్డి, అమర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఈ నెల 24వ తేదీ లోపు తమ జట్ల పేర్లను నమోదు చేసుకోవడానికి 7997575555 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలన్నారు. మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు రూ. 30 వేలు, 20, 10, 10 వేల చొప్పున నగదు బహుమతి అందజేస్తామని, దూర ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులకు వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. 



Updated Date - 2021-01-21T06:56:30+05:30 IST