మినప్పప్పు కచోరి
ABN , First Publish Date - 2021-01-09T15:06:14+05:30 IST
మైదా - ఒక కప్పు, గోధుమపిండి - ఒక కప్పు, బేకింగ్ పౌడర్ - అర టీస్పూన్, ఉప్పు - తగినంత, నెయ్యి - మూడు టేబుల్స్పూన్లు, మినప్పప్పు - అరకప్పు, అల్లం ముక్క
మకర సంక్రాంతి రోజున ఉత్తరప్రదేశ్ ప్రజలు ఈ వంటకం తప్పక తయారు చేసుకుంటారు.
కావలసినవి: మైదా - ఒక కప్పు, గోధుమపిండి - ఒక కప్పు, బేకింగ్ పౌడర్ - అర టీస్పూన్, ఉప్పు - తగినంత, నెయ్యి - మూడు టేబుల్స్పూన్లు, మినప్పప్పు - అరకప్పు, అల్లం ముక్క - చిన్నది, పచ్చిమిర్చి - రెండు, నెయ్యి - అర టేబుల్స్పూన్, జీలకర్ర - అర టీస్పూన్, పసుపు - చిటికెడు, కారం - అర టీస్పూన్, ధనియాల పొడి - అర టీస్పూన్, సోంపు పొడి - అర టీస్పూన్, మామిడికాయ పొడి - ఒక టీస్పూన్, ఇంగువ - చిటికెడు, నూనె - సరిపడా.
తయారీ విధానం: మినప్పప్పును మూడు నాలుగు గంటలపాటు నానబెట్టుకోవాలి. తరువాత మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా పట్టుకోవాలి. ఒక పాత్రలో పిండిని తీసుకుని అందులో బేకింగ్ పౌడర్, కొద్దిగా ఉప్పు, నెయ్యి, కొద్దిగా నూనె వేసి కలియబెట్టుకోవాలి. తరువాత కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి మిశ్రమంలా అయ్యేలా కలుపుకొని పలుచట్టి వస్త్రం కప్పి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్పై పాన్ పెట్టి నెయ్యి వేయాలి. నెయ్యి కాస్త వేడి అయ్యాక జీలకర్ర వేసి వేగించాలి. తరువాత అల్లం, పచ్చిమిర్చి వేయాలి. కాసేపు వేగిన తరువాత పసుపు, కారం, ధనియాల పొడి, సోంపు, ఇంగువ వేసుకోవాలి. తరువాత మినప్పప్పు పేస్టు వేసి కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. స్టవ్పై నుంచి దింపుకొని చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ చిన్నసైజు బాల్స్లా చేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా కలిపిపెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న సైజు పూరీలా ఒత్తుకోవాలి. తరువాత మధ్యలో మినప్పప్పు మిశ్రమం బాల్ను పెట్టాలి. చివరలు దగ్గరకు ఒత్తి మళ్లీ చేత్తో కచోరీలా ఒత్తుకోవాలి. స్టవ్పై పాన్ పెట్టి నూనె పోసి కాస్త వేడి అయ్యాక కచోరీలు వేసి వేగించి తీసుకుని సర్వ్ చేసుకోవాలి.