కడప: గ్రామ వాలంటీర్పై వైసీపీ నేత చెప్పుతో దాడి
ABN , First Publish Date - 2020-07-02T13:48:44+05:30 IST
కడప: గ్రామ వాలంటీర్పై వైసీపీ నేత చెప్పుతో దాడి
కడప: జిల్లాలోని పులివెందులలో గ్రామ వాలంటీర్ పట్ల వైసీపీ నేత దారుణంగా వ్యవహరించారు. పెన్షన్ల పంపిణీలో తాను చెప్పినట్లు పనిచేయడం లేదని వాలంటీర్ గౌతమిపై వైసీపీ నేత రఘునాథ్ రెడ్డి చెప్పుతో దాడి చేశారు. దీంతో బాధితురాలు గౌతమి పోలీసులను ఆశ్రయించారు. తనపై దాడి చేసిన వైసీపీ నేతపై గౌతమి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.