మైనారిటీ రాష్ట్ర నాయకుడు ఫరూక్ ఫిర్యాదుపై హెచ్ఆర్సీ స్పందన
ABN , First Publish Date - 2021-10-05T16:55:46+05:30 IST
మైనారిటీ రాష్ట్ర నాయకుడు ఫరూక్ సుబ్లి ఇచ్చిన ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమీషన్ స్పందించింది.
కడప: మైనారిటీ రాష్ట్ర నాయకుడు ఫరూక్ సుబ్లి ఇచ్చిన ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమీషన్ స్పందించింది. దువ్వూరు మండలం ఎర్రబల్లికి చెందిన అగ్బర్ భూవివాదం, సుబ్లి అరెస్ట్లపై జాతీయ మానవ హక్కుల కమీషన్కు సుబ్లీ ఫిర్యాదు చేశారు. సుబ్లి ఫిర్యాదుపై వెంటనే స్పందించాలని కడప ఎస్పీకి కమీషన్ సూచించింది. 8 వారాలలోపు సరైన చర్యలు చేపట్టాలని ఎస్పీని హెచ్ఆర్సీ ఆదేశించింది.