వేంపల్లెలో TDP నేత ఇంటిపై రాళ్లు, రాడ్లతో దాడి
ABN , First Publish Date - 2021-11-03T15:34:03+05:30 IST
జిల్లాలోని వేంపల్లెలో టీడీపీకి చెందిన కృష్ణారెడ్డి ఇంటిపై అర్ధరాత్రి కొంత మంది వ్యక్తులు రాళ్లు, రాడ్లతో దాడి చేశారు.
కడప: జిల్లాలోని వేంపల్లెలో టీడీపీకి చెందిన కృష్ణారెడ్డి ఇంటిపై అర్ధరాత్రి కొంత మంది వ్యక్తులు రాళ్లు, రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇన్నోవా వాహనం, ఇంట్లోని వస్తువులను ధ్వంసమయ్యాయి. ఘటనపై బాధితుడు కృష్ణారెడ్డి వేంపల్లె పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పు చెల్లించలేదని క్రిష్ణారెడ్డిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.