కడపలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభం

ABN , First Publish Date - 2021-10-04T17:49:03+05:30 IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు బద్వేల్ మంత్రులు సమావేశమయ్యారు. బద్వేలు ఉపఎన్నికల కోసం వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది.

కడపలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభం

కడప: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు బద్వేల్‌లో మంత్రులు సమావేశమయ్యారు. బద్వేల్ ఉపఎన్నికల కోసం వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ సజ్జల రామకృష్ణా రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, నారాయణస్వామి, ఎన్నికల ఇంచార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి అదిమూలం సురేష్, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. టీడీపీ పోటీ నుండి విరమించుకున్నా... బీజేపీ పోటీపడుతుండడంపై సమావేశంలో సుధీర్ఘంగా చర్చించనున్నారు. మరోవైపు పోలింగ్ బూతుల కన్వీనర్లతో వైసీపీ అభ్యర్థి సుధా సమావేశమయ్యారు. 

Updated Date - 2021-10-04T17:49:03+05:30 IST