ఎంసీఏ విభాగాన్ని గురుకులానికి మార్పు

ABN , First Publish Date - 2020-09-25T11:21:37+05:30 IST

ఎంసీఏ విభాగాన్ని గురుకులానికి మార్పు

ఎంసీఏ విభాగాన్ని గురుకులానికి మార్పు

కడప(వైవీయూ), సెప్టెంబరు 24: వైవీయూలోని ఎంసీఏ విభాగాన్ని గురుకుల భవనాల్లోకి మార్చుతున్నట్లు వీసీ సూర్యకళావతి ఉత్తర్వులు జారీ చేశారు. వైవీయూలోని స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ఆధ్వర్యంలో గురుకుల భవనాలు ఉండేవని, ప్రభుత్వం ఆ భవనాలను వైవీయూకి అప్పగించిందని అందులో భాగంగా ఎంసీఏ విభాగాన్ని గురుకులానికి మార్చామని యూనివర్శిటీ అదికారులు తెలిపారు. ఇప్పటికే ఆ భవనాల్లో ఎంబీఏ కామర్స్‌ కోర్సులు నిర్వహిస్తున్నారు. గురుకుల భవనాలను వీసీ పరిశీలించి విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించాలని వీసీ ఇంజనీరింగ్‌ విభాగాన్ని సూచించారు.

Updated Date - 2020-09-25T11:21:37+05:30 IST