387 పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-10-01T06:26:54+05:30 IST

జిల్లాలో మరో 387 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 44,003కు చేరింది.

387 పాజిటివ్‌ కేసులు

ముగ్గురి మృతి


కడప, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో 387 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 44,003కు చేరింది. మరో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకు 445 మంది మృత్యువాత పడ్డారు. కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకున్న 267 మందిని డిశ్చార్జి చేశారు. దీంతో ఇప్పటి వరకు 40,318 మంది డిశ్చార్జి అయ్యారు. 2504 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. 4,08,457 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

Updated Date - 2020-10-01T06:26:54+05:30 IST