127 పాజిటివ్‌ కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-10-28T09:03:54+05:30 IST

జిల్లాలో మరో 127 మందిలో కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది.

127 పాజిటివ్‌ కేసులు నమోదు

నలుగురి మృతి

కడప, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో 127 మందిలో కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 51,564కు చేరింది. మరో నలుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు 506 మంది మృత్యువాత పడ్డారు. కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకున్న 260 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 49,622 మంది కోలుకున్నారు. 1370 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2020-10-28T09:03:54+05:30 IST