వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం

ABN , First Publish Date - 2020-10-29T09:26:10+05:30 IST

వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వనాశనమైందని టీడీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి ధ్వజమెత్తారు.

వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం

ఎర్రగుంట్ల, అక్టోబరు 28: వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వనాశనమైందని టీడీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం  టీడీపీ కార్యాలయంలో  రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రె డ్యం వెంకటసుబ్బారెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మా ట్లాడు తూ రైతులకు బేడీలు వేసిన దుర్మార్గమైన పాలన ఇక్కడ సాగుతోందన్నారు.  జమ్మలమడుగు నియోజవర్గంలో టీడీపీకి మంచి నాయకుడిని  వెంటనే నియమించాలని మాజీ జడ్పీటీసీ సభ్యుడు వడ్డమాని వెంకటశివారెడ్డి  కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి సుంకరనాగే శ్వరరావు,  నాయకులు డి.రమేష్‌నాయుడు, సంజీవరెడ్డి, కొండన్న, రమేష్‌, నాగభూషణం రెడ్డి, ఎన్‌.సంజీవరెడ్డి, శ్రీనివాసులు, నాగరాజు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-29T09:26:10+05:30 IST