కడప ఘటనపై అచ్చెన్న దిగ్ర్భాంతి

ABN , First Publish Date - 2021-05-08T19:38:09+05:30 IST

కడప జిల్లాలోని మామిళ్లపల్లె శివారులో ముగ్గురాయి క్వారీలో జరిగిన పేలుడులో 10 మంది దుర్మరణం చెందిన విషయం విదితమే.

కడప ఘటనపై అచ్చెన్న దిగ్ర్భాంతి

అమరావతి: కడప జిల్లాలోని మామిళ్లపల్లె శివారులో ముగ్గురాయి క్వారీలో జరిగిన పేలుడులో 10 మంది దుర్మరణం చెందిన విషయం విదితమే. ఈ ఘటనపై తెలుగుదేశం ఆంధ్రప్రధేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కరోనా ఉద్ధృతిలో మైనింగ్‌కు అనుమతులు ఎలా ఇచ్చారు? అని ప్రశ్నించారు. మృతుల కుటుంబాలకు ఎల్జీ పాలిమర్స్ మాదిరిగానే నష్టపరిహారం ప్రకటించాలని డిమాండు చేశారు. ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందజేయాలన్నారు. వివిధ పరిశ్రమలు, గనుల్లో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అచ్చెన్నాయుడు తెలిపారు.


కడప : జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కలసపాడు మండలంలో మామిళ్లపల్లె గ్రామ శివారులో ముగ్గురాళ్ల గనిలో పేలుడు సంభవించింది. ముగ్గు రాళ్ల గనిలో ఉన్న 10 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. ముగ్గురాళ్లను తొలగించడానికి పేలుడు పదార్థాలను వినియోగించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

Updated Date - 2021-05-08T19:38:09+05:30 IST