పెళ్లి చేసుకుంటావా అని సరదాగా అంటే కొట్టి చంపేశారు!

ABN , First Publish Date - 2020-12-12T20:37:14+05:30 IST

‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అంటూ కొంతమంది చిన్నపిల్లలను ఆటపట్టిస్తుంటారు. గ్రామాల్లో ఇలాంటి ఘటనలు ఎదురవుతుంటాయి. అయితే అలాంటి మాటే

పెళ్లి చేసుకుంటావా అని సరదాగా అంటే కొట్టి చంపేశారు!

కడప: ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అంటూ కొంతమంది చిన్నపిల్లలను ఆటపట్టిస్తుంటారు. గ్రామాల్లో ఇలాంటి ఘటనలు ఎదురవుతుంటాయి. అయితే అలాంటి మాటే ఓ మహిళ హత్యకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. పులివెందుల నాగమ్మ అనే మహిళ లింగాల మండలం పెద్దకూడాల శివారుల్లో గొర్రెలను మేపుతోంది. అక్కడే ఆమెను బండరాయితో మోది హత్యచేశారు. ఈ కేసును పోలీసులు ఐదు రోజుల్లో ఛేదించారు. ఇద్దరు మైనర్లు హత్య చేసినట్లు గుర్తించారు. హత్యకు ముందు రోజు మైనర్లతో మాట్లాడుతూ.. తనను పెళ్లి చేసుకుంటావా అని సదరు మహిళ వారిలో ఒకరిని సరదాగా ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు కోపగించుకున్న వారు.. మరుసటి రోజు ఆమె గొర్రెలు మేపుతున్న చోటుకి వెళ్లి గొడవ పడ్డారు. ఈ గొడవలోనే ఆమెను బండరాయితో కొట్టి చంపారు. వారిద్దని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. జిల్లా బాలల నేరస్తుల గృహానికి తరలిస్తామని తెలిపారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ అన్బురాజన్ మీడియాకు వివరాలు అందించారు. 

Updated Date - 2020-12-12T20:37:14+05:30 IST