నేడు కమలాపురంలో వైసీపీ ఎమ్మెల్యేల రైల్రోకో
ABN , First Publish Date - 2022-01-10T15:03:16+05:30 IST
జిల్లాలోని కమలాపురంలో ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలు రైల్ రోకో నిర్వహించనున్నారు.
కడప: జిల్లాలోని కమలాపురంలో ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలు రైల్ రోకో నిర్వహించనున్నారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రైల్వే గేట్ వద్ద రైల్ రోకో చేపట్టనున్నారు. ఎక్స్ప్రెస్ రైళ్ళు కమలాపురం, కొండాపురం, ముద్దనూరు, నందలూరు స్టేషన్లలో ఆపాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు రైల్ రోకో చేయనున్నారు. గతంలో ఆయా స్టేషన్లలో ఆపేవారని, కోవిడ్ తరువాత రైళ్ల ఆపడం లేదని అన్నారు. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రైళ్లను ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. పలుసార్లు రైల్వే అధికారులకు లేఖలు రాసినప్పటికీ సానుకూల స్పందన రాకపోవడంతో ఎమ్మెల్యే రవీంద్రనాద్ రెడ్డి రైల్రోకో చేపట్టారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్కు మద్దతు తెలుపుతూ రైల్ రోకోలో ఎంపీ అవినాష్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.