వైఎస్ వివేకా హత్య కేసులో 14వ రోజు సీబీఐ విచారణ

ABN , First Publish Date - 2021-06-20T16:35:18+05:30 IST

దివంగత నేత వైఎస్ వివాకానంద రెడ్డి హత్య కేసులో కడప సెంట్రల్ జైలు కేంద్రంగా 14వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది.

వైఎస్ వివేకా హత్య కేసులో 14వ రోజు సీబీఐ విచారణ

కడప: దివంగత నేత వైఎస్ వివాకానంద రెడ్డి హత్య కేసులో కడప సెంట్రల్ జైలు కేంద్రంగా 14వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. నేడు సీబీఐ విచారణకు నాలుగవ రోజు వివేకా ముఖ్య అనుచరుడు ఎర్రగంగిరెడ్డి హాజరయ్యారు. పులివెందుల, సింహాద్రిపురం మండలాలకు చెందిన ఓబుల్ పతినాయుడు, రాఘవేంద్ర, కిశోర్ కుమార్ రెడ్డిలు కూడా విచారణకు హాజరయ్యారు. వీరిని పలు కోణాలలో సీబీఐ బృందం విచారిస్తోంది. 

Updated Date - 2021-06-20T16:35:18+05:30 IST