గులాబీ గూటికి కడారి అంజయ్య
ABN , First Publish Date - 2021-03-31T00:37:03+05:30 IST
జిల్లాలోని నాగార్జన సాగర్ నియోజకవర్గంలో బీజేపీ కీలక నాయకుడు కడారి అంజయ్య
నల్గొండ: జిల్లాలోని నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీజేపీ కీలక నాయకుడు కడారి అంజయ్య టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో అంజయ్య టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరడానికి ముందు 100 మంది అనుచరులతో అంజయ్య ఫామ్హౌస్కి వెళ్లారు. సాగర్ ఉపఎన్నికల్లో బీజేపీ నుంచి కడారి అంజయ్య టికెట్ ఆశించారు. అయితే ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో తన అనుచరులతో కలిసి అంజయ్య టీఆర్ఎస్లో చేరారు. రాబోయే రోజులలో అంజయ్యకు కీలక పదవి ఇస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, శానంపూడి సైదిరెడ్డి తదితరులు ఉన్నారు.