జలకళను సంతరించుకున్న కడెం ప్రాజెక్టు

ABN , First Publish Date - 2020-08-04T22:10:33+05:30 IST

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది.

జలకళను సంతరించుకున్న కడెం ప్రాజెక్టు

నిర్మల్ జిల్లా: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో పెరిగింది. దీంతో ప్రాజెక్టు నిండు కుండలా మారింది. వరద ప్రవాహం పెరగడంతో ఒక గేటు ఎత్తి నీటిని విడుదల చేశారు. కడెం ప్రాజెక్టు నీటి మట్టం 700 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 697.5 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో 1021 క్యూసెక్కులు ఉండగా ఒక గేటు ఎత్తి 3,800 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.

Updated Date - 2020-08-04T22:10:33+05:30 IST