కదిలిన తెలుగుదండు
ABN , First Publish Date - 2021-09-18T05:45:39+05:30 IST
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై టీడీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం చేపట్టిన ‘రైతుకోసం తెలుగుదేశం’ కార్యక్రమం విజయవంతమైంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి నిరసన తెలిపారు.
‘రైతుకోసం తెలుగుదేశం’ విజయవంతం
పెద్ద సంఖ్యలో పాల్గొన్న టీడీపీ శ్రేణులు
అధికారులకు వినతిపత్రాలిచ్చిన నేతలు
(ఆంధ్రజ్యోతి బృందం)
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై టీడీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం చేపట్టిన ‘రైతుకోసం తెలుగుదేశం’ కార్యక్రమం విజయవంతమైంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి నిరసన తెలిపారు. రైతులు గతంలో ఎన్నడూ లేని ఇబ్బందులను ప్రస్తుతం ఎదుర్కొంటున్నారని, వారి సమస్యల పరిష్కారంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని నేతలు ఆరోపించారు. జిల్లాలో సాగునీటి కాలువల ద్వారా నీరందని పరిస్థితి ఎదురవుతోందని, మోటార్లకు విద్యుత్ మీటర్ల ఏర్పాటు, గిట్టుబాటు ధర లేకపోవడం తదితర సమస్యలతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణం రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అధికారులకు వినతిపత్రాలు అందించారు.