చంద్రబాబుపై జగన్ మాఫియా దుష్ప్రచారం: కళా

ABN , First Publish Date - 2020-02-14T22:58:20+05:30 IST

వైసీపీ నేతల తీరుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు మండిపడ్డారు. జగన్ మీడియా చెప్పే అబద్ధాలకు అడ్డు లేకుండా పోతుందని

చంద్రబాబుపై జగన్ మాఫియా దుష్ప్రచారం: కళా

శ్రీకాకుళం: వైసీపీ నేతల తీరుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు మండిపడ్డారు. జగన్ మీడియా చెప్పే అబద్ధాలకు అడ్డు లేకుండా పోతుందని మండిపడ్డారు. చంద్రబాబుపై జగన్ మాఫియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు. జగన్ తన చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. దేశం మొత్తం 40 చోట్ల ఐటీ సోదాలు చేసిందన్నారు. దేశంలో జరిగే సోదాలన్నీ చంద్రబాబుకి అంటగడుతూ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 


ఐటీ సోదాలు జరిగిన కంపెనీకే వైసీపీ ప్రభుత్వం పోలవరం టెండర్లు కట్టబెట్టిందని విమర్శించారు. జగన్ వ్యవహారం దొంగే దొంగ అన్నట్టుగా ఉందని ఎద్దేవాచేశారు. ‘ఆర్ధిక నేరాలు చేసే వ్యక్తి సాక్షులను తారుమారు చేస్తారని సీబీఐ చెప్పలేదా?, జగన్ ఎల్లో మీడియాకు సీబీఐ కోర్టులో జరిగిన పరిణామాలు కనిపించవా?, 8 సంవత్సరాల నుంచి జగన్ ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో చెప్పాలి?, వీళ్లా చంద్రబాబు కుటుంబంపై నిందలు వేసేది.2019 ఎన్నికల్లో వైసీపీ విచ్చలవిడిగా డబ్బు వెదజల్లింది. జగన్‌కు కోర్టులు, వ్యవస్థలపై గౌరవం లేదు. భయపెట్టి పాలన చేసే వారు చరిత్రలో కనుమరుగయ్యారు’ అని కళా వెంకట్రావు వ్యాఖ్యానించారు. ఆచరణ సాధ్యంకాని హామీలతో వైసీపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.

Updated Date - 2020-02-14T22:58:20+05:30 IST