జగన్ ప్రోద్బలంతోనే చంద్రబాబుపై దాడి: కళా వెంకట్రావు

ABN , First Publish Date - 2021-04-13T19:47:24+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రోద్బలంతోనే తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై రాళ్ల దాడి జరిగిందని టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు పేర్కొన్నారు.

జగన్ ప్రోద్బలంతోనే చంద్రబాబుపై దాడి: కళా వెంకట్రావు

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రోద్బలంతోనే తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై రాళ్ల దాడి జరిగిందని టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా నాయకులపై ఎన్ని దాడులు చేసినా తిరుపతిలో వైసీపీకి ఓటమి తప్పదని హెచ్చరించారు. వైసీపీ అవలంబిస్తున్న రాజారెడ్డి రాజ్యాంగానికి రాళ్లదాడే ప్రత్యక్ష నిదర్శనమని చెప్పారు. ప్రజలను మెప్పించి ఓట్లు పొందడం చేతగాక.. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై దాడి చేసిన వారిని వెంటనే  అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.  చంద్రబాబు సభలకు తగిన రక్షణ కల్పించాలని వైసీపీ ప్రభుత్వాన్ని కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-04-13T19:47:24+05:30 IST