కలైంజర్‌ స్మారక మందిరం పనులు వేగవంతం

ABN , First Publish Date - 2021-10-19T15:34:53+05:30 IST

మదురై నగరంలో నిర్మాణంలో ఉన్న కలైంజర్‌ స్మారక లైబ్రరీ, స్మారక మందిరం పనులను వేగ వంతం చేయాల్సిందిగా అధికారులకు ఉత్తర్వులిచ్చినట్టు ప్రజాపనుల శాఖ మంత్రి ఏవీ వేలు తెలిపారు. సచివాలయంలో

కలైంజర్‌ స్మారక మందిరం పనులు వేగవంతం

ప్యారీస్‌(chennai): మదురై నగరంలో నిర్మాణంలో ఉన్న కలైంజర్‌ స్మారక లైబ్రరీ, స్మారక మందిరం పనులను వేగ వంతం చేయాల్సిందిగా అధికారులకు ఉత్తర్వులిచ్చినట్టు ప్రజాపనుల శాఖ మంత్రి ఏవీ వేలు తెలిపారు. సచివాలయంలో సోమవారం ప్రజాపనుల శాఖ తరపున ప్రకటించిన పలు పథకాలు, ప్రకటనలు, ప్రకటనల పనితీరు, వారి వివరాలు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేయడం తదితర అంశాలపై చీఫ్‌ ఇంజనీర్లతో మంత్రి ఏవీ వేలు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ఈ ఏడాది అసెంబ్లీలో ప్రకటించిన పథకాల్లో ఉత్తర్వులు జారీచేయాల్సిన పథకాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న పథకాలన్నింటినీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు. కలైంజర్‌ స్మారక లైబ్రరీ, స్మారక మందిరం పనులను వచ్చే డిసెంబరు నాటికి పూర్తిచేయాల్సిందేనని ఆదేశించారు. 

Updated Date - 2021-10-19T15:34:53+05:30 IST