కొవిడ్‌పై కళాజాత

ABN , First Publish Date - 2021-05-14T04:45:26+05:30 IST

ప్రస్తుతం విలయతాండవం చేస్తున్న కరోనా నియంత్రణలో భాగంగా గురువారం మండలంలోని జీ.కొండారెడ్డిపల్లి గ్రామంలో సర్పంచు కుమ్మిత ప్రతాప్‌రెడ్డి

కొవిడ్‌పై కళాజాత

వరికుంటపాడు, మే 13: ప్రస్తుతం విలయతాండవం చేస్తున్న కరోనా నియంత్రణలో భాగంగా గురువారం మండలంలోని జీ.కొండారెడ్డిపల్లి గ్రామంలో సర్పంచు కుమ్మిత ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో కళాజాత బృంద సభ్యులు సాంస్కృతిక కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే పంచాయతీతోపాటు పెద్దిరెడ్డిపల్లిలోనూ సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేయించడంతో పాటు బ్లీచింగ్‌ చల్లించి పారిశుధ్య పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-14T04:45:26+05:30 IST