కలామ్కు నివాళి
ABN , First Publish Date - 2021-10-17T05:46:34+05:30 IST
మాజీ రాష్ట్రపతి అబ్దుల్కలామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే అశోక్రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
గిద్దలూరు, అక్టోబరు 16 : మాజీ రాష్ట్రపతి అబ్దుల్కలామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే అశోక్రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అబ్దుల్కలామ్ జీవితాన్ని నేటితరం యువత ఆదర్శంగా తీసుకోవాలని అశోక్రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు షాన్షావలి, మాజీ అధ్యక్షుడు షేక్ మస్తాన్, నాయకులు గర్రె సా యినాథ్, వీణాధరి శర్మ, వెంకటరామిరెడ్డి, రాఘవేంద్రయాదవ్, వాసవీ క్లబ్ ప్రతినిధి శివపురం మురళీకృష్ణ పాల్గొన్నారు. ఫాతి మా సేవాసంస్థ ఆధ్వర్యంలో కలాం విగ్రహానికిపూలమాలలు వేసి నివాళులర్పించారు. సంస్థ అధ్యక్షుడు నంద్యాల ఖాశింవలి, సభ్యులు హుస్సేనయ్య, ఖాదర్బాషా, దస్తగిరి పాల్గొన్నారు. రైల్వేస్టేషన్ సమీపం వద్ద కలాం విగ్రహానికి ముస్లిం మైనారిటీ నాయకులు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యుడు షేక్ మస్తాన్వలి పాల్గొన్నారు. మన స్నేహం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అబ్దుల్ కలామ్ జయంతిని నిర్వహించారు. కేఎస్పల్లి పీహెచ్సీ డాక్టర్ నాయబ్రసూల్ కలా మ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.