కాళ్ళకూరు ఆలయ కమిటీ ప్రమాణస్వీకారం

ABN , First Publish Date - 2021-10-17T05:13:58+05:30 IST

కాళ్ళకూరు వేంకటేశ్వర స్వా మి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే మం తెన రామరాజు అన్నారు.

కాళ్ళకూరు ఆలయ కమిటీ ప్రమాణస్వీకారం
ప్రమాణస్వీకారం చేస్తున్న ఆలయ కమిటీ కార్యవర్గం

కాళ్ళ, అక్టోబరు 16 :  కాళ్ళకూరు వేంకటేశ్వర స్వా మి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే మం తెన రామరాజు అన్నారు. కాళ్ళకూరు వేంకటేశ్వర స్వా మి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం శనివారం నిర్వహించారు. ఆలయ చైర్మన్‌గా దండు వెంకట కృష్ణంరాజు (డీవీ), సభ్యులుగా గాదిరాజు వెం కట నరేష్‌రాజు, పెన్మెత్స కుమార్‌రాజు, బొర్రా సత్యనారాయణ, కంబాల భ్రమ రాంబ, బొర్రా మణి, గార ఈశ్వరమ్మ, దుప్పాడ లక్ష్మీ, కొర్రపాటి గ్రేసమ్మ, ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ఎస్‌టికే సింహాద్రి, అప్పలాచార్యులుతో జిల్లా దేవదాయ ధర్మదాయశాఖ సహాయ కమిషనర్‌ ప్రసాద్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈవో ముదునూరి సత్యనారాయణరాజు పర్యవేక్షించారు. కార్యక్రమంలో కైకలూ రు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, వైసీపీ ఉండి ఇన్‌ఛార్జి గోకరాజు రామరాజు, క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ పాతపాటి సర్రాజు, ఎంపీపీ పెన్మెత్స శిరీషా విశ్వనాథరాజు, జడ్పీటీసీ పచ్చిగోళ్ళ సోమేశ్వరరావు, సర్పంచ్‌ సాధు శ్రీదేవి, నంబూరి శ్రీదేవి,ఉప సర్పంచ్‌ నడింపల్లి ప్రదీప్‌రాజు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-17T05:13:58+05:30 IST