జోగి రమేష్ను అరెస్టు చేయాలి: కాలవ శ్రీనివాసులు
ABN , First Publish Date - 2021-09-17T21:04:25+05:30 IST
జోగి రమేష్ను అరెస్టు చేసి, ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
అనంతపురం: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడికి పాల్పడిన జోగి రమేష్ను అరెస్టు చేసి, ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఆగడాలకు అంతే లేకుండా పోతోందన్నారు. ఏకంగా ప్రతిపక్షనేత చంద్రబాబు ఇంటిపై దాడికి వెళతారా? అంటూ ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసుల అలుసు.. అండతోనే అంత దూరం వెళ్లారని విమర్శించారు. జోగి రమేష్ను అంతవరకు ఏ విధంగా రానిచ్చారని ప్రశ్నించారు. కావాలనే శాంతి భద్రతల సమస్యను వైసీపీ సృష్టిస్తోందని కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు.