జగనే హిందూ సంప్రదాయాలను పాటించకుంటే.. ఏ మంత్రి పాటిస్తారు?: కాల్వ

ABN , First Publish Date - 2020-09-23T20:17:18+05:30 IST

అనంతపురం: టీడీపీ లౌకిక వాద పార్టీ అని.. ప్రభుత్వం నుంచి భక్తులు ఒకటి ఆశిస్తుంటే..

జగనే హిందూ సంప్రదాయాలను పాటించకుంటే.. ఏ మంత్రి పాటిస్తారు?: కాల్వ

అనంతపురం: టీడీపీ లౌకిక వాద పార్టీ అని.. ప్రభుత్వం నుంచి భక్తులు ఒకటి ఆశిస్తుంటే.. ప్రభుత్వం మరొకటి చేస్తోందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంతర్వేదిలో రథాన్ని దగ్ధం చేసినా, విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి సింహాలు మాయం అయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. టీడీపీతో పాటు ఇతర పార్టీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారన్నారు. సాక్షాత్తు సీఎం జగన్ హిందూ సంప్రదాయాలను పాటించకుంటే ఇక ఏ మంత్రి పాటిస్తారని వాపోయారు. జగన్ ఇచ్చిన స్క్రిప్ట్‌నే మంత్రులు చదువుతున్నారని కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్, ముఖ్యమంత్రి సమీప బంధువు ఒకలాగా, మంత్రి కొడాలి నాని ఒకలా మాట్లాడుతున్నారన్నారు. 




నమ్మకం, విశ్వాసాలతో ప్రభుత్వ పెద్దలు అట లాడుకుంటున్నారని కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. 

Updated Date - 2020-09-23T20:17:18+05:30 IST