అంతర్మథనంలో కమలనాథులు

ABN , First Publish Date - 2021-07-24T00:23:31+05:30 IST

మాజీ మంత్రి, బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు పార్టీకి రాజీనామా చేయడంతో కమలనాథుల్లో

అంతర్మథనంలో కమలనాథులు

హైదరాబాద్: మాజీ మంత్రి, బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు పార్టీకి రాజీనామా చేయడంతో కమలనాథుల్లో అంతర్మథనం మొదలైంది. పార్టీలో అసంతృప్తుల అంశంపై బీజేపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. నగర శివారు ప్రాంతంలో బీజేపీ నాయకులు రహస్య సమావేశం అయ్యారు. ఇప్పటికే పార్టీకి మోత్కుపల్లి, ఎర్ర శేఖర్, గండ్రా సత్యనారాయణ రాజీనామా చేసారు. మోత్కుపల్లి నర్సింహులు రాజీనామాను బీజేపీ లైట్ తీసుకుంటోంది. మరింత మంది రాజీనామాలు చేయకుండా దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి పార్టీ సిద్ధమైంది. 


రోజు రోజుకు పెరుగుతోన్న అసంతృప్త నేతలను బుజ్జగించే అంశంపై చర్చ జరిగింది. ఇప్పటికే పలువురు అసంతృప్త నేతలతో బీజేపీ రాష్ట్ర చీఫ్ సంజయ్ మాట్లాడారు. పార్టీలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అసంతృప్తితో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. అసంతృప్తులను బుజ్జగించడంతో పాటు పార్టీలో చేరికలపై నేతలు చర్చిస్తోన్నారు.  

Updated Date - 2021-07-24T00:23:31+05:30 IST