Tokyo olympics: మహిళల డిస్కస్త్రోలో ఫైనల్ చేరిన కమల్ప్రీత్ కౌర్
ABN , First Publish Date - 2021-07-31T16:15:23+05:30 IST
ఒలింపిక్స్లో భారత్ మరో పతకం సాధించే దిశగా అడుగేసింది. మహిళల డిస్కస్త్రోలో భారత క్రీడాకారిణి కమల్ప్రీత్ కౌర్ ఫైనల్ చేరింది.
టోక్యో: ఒలింపిక్స్లో భారత్ మరో పతకం సాధించే దిశగా అడుగేసింది. మహిళల డిస్కస్త్రోలో భారత క్రీడాకారిణి కమల్ప్రీత్ కౌర్ ఫైనల్ చేరింది. ఇవాళ(శనివారం) జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లో కమల్ప్రీత్ 64 మీటర్లతో రెండో స్థానంలో నిలిచింది. దాంతో ఆమె ఫైనల్కు చేరింది. ఇక క్వాలిఫికేషన్ రౌండ్లో కమల్ప్రీత్ తొలి ప్రయత్నంలో 60.29 మీటర్లు, రెండో ప్రయత్నంలో 63.97 మీటర్లు డిస్కస్ త్రో చేసింది. చివరికి మూడోసారి 64 మీటర్లు విసరడంతో ఫైనల్కు అర్హత సాధించింది. మరోవైపు భారీ అంచనాలతో బరిలోకి దిగిన సీమా పూనియా 16వ స్థానంతో సరిపెట్టుకుని ఇంటిముఖం పట్టింది. కాగా, సోమవారం జరిగే ఫైనల్స్లో మొత్తం 12 మంది పోటీపడనున్నారు. అక్కడ కూడా కమల్ప్రీత్ ఇలాంటి అద్భుత ప్రదర్శన చేస్తే భారత్ ఖాతాలో మరో పతకం చేరడం ఖాయం.