పిట్లం తహశీల్దార్తో టీఆర్ఎస్ నేతల వాగ్వాదం
ABN , First Publish Date - 2021-09-17T18:15:55+05:30 IST
జిల్లాలోని పిట్లం తహశీల్దార్ రామ్ మోహన్తో టీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు.
కామారెడ్డి: జిల్లాలోని పిట్లం తహశీల్దార్ రామ్ మోహన్తో టీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. గ్రామాలలో వీఆర్ఏలు సర్పంచుల మాట వినడం లేదని తహశీల్దార్కు మండల సర్పంచులు పిర్యాదు చేశారు. అయితే సర్పంచుల మాట వినాలని రూల్ ఉందా అంటూ తహశీల్దార్ ఎదురు ప్రశ్న వేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ నేతలు... వీఆర్ఏలను తమ సొంత పనులకు వాడుకోవడం లేదా అని గొడవకు దిగారు.