కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2020-10-23T17:58:31+05:30 IST

జిల్లాలోని క్యాసంపల్లి శివారులో 44వ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం

కామారెడ్డి: జిల్లాలోని క్యాసంపల్లి  శివారులో 44వ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తల్లీ,కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు నాగర్ కర్నూలు జిల్లా సానిపల్లికి చెందిన నర్సమ్మ (42), శంకర్ (2)గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-10-23T17:58:31+05:30 IST