కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం..వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-12-05T16:48:48+05:30 IST

జిల్లాలోని సదాశివనగర్ మండలం పద్మాజివాడి గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం..వ్యక్తి మృతి

కామారెడ్డి: జిల్లాలోని సదాశివనగర్ మండలం పద్మాజివాడి గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. బైక్‌ను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్‌పై ప్రయాణిస్తున్న సయ్యద్ అఫ్జల్ (37) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. 

Updated Date - 2020-12-05T16:48:48+05:30 IST