Telangana: రోడ్డు ప్రమాదంలో ఏడేళ్ల చిన్నారి మృతి

ABN , First Publish Date - 2021-11-04T16:01:30+05:30 IST

జిల్లాలోని బిక్కనూర్ మండలం జంగంపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడేళ్ల చిన్నారి మృతి చెందింది.

Telangana: రోడ్డు ప్రమాదంలో ఏడేళ్ల చిన్నారి మృతి

కామారెడ్డి: జిల్లాలోని బిక్కనూర్ మండలం జంగంపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడేళ్ల చిన్నారి మృతి చెందింది. అతివేగంతో దూసుకువచ్చిన కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఏడేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-11-04T16:01:30+05:30 IST