నిజాంసాగర్ ప్రాజెక్ట్ పరిసర ప్రాంతంలో చిరుత సంచారం
ABN , First Publish Date - 2021-10-25T13:33:04+05:30 IST
జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ గుల్గాస్తా పరిసర ప్రాంతంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది.
కామారెడ్డి: జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ గుల్గాస్తా పరిసర ప్రాంతంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్ళిన వారికి రహదారిపై చిరుత కనిపించింది. చిరుత కదలికల్ని కొందరు యువకులు సెల్ఫోన్లో బంధించారు. చిరుత సంచారంతో పర్యాటకులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.