Kamareddy: కుళ్లిపోయిన మహిళ మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2021-12-07T15:12:13+05:30 IST
జిల్లాలోని కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవుని పల్లి గ్రామ శివారులో గల దేవి విహార్ సమీపంలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం లభ్యమైంది.
కామారెడ్డి: జిల్లాలోని కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవునిపల్లి గ్రామ శివారులో గల దేవి విహార్ సమీపంలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం లభ్యమైంది. గత నెల 17న కామారెడ్డి మండలం క్యాసంపల్లి తండాకు చెందిన అదృశ్యమైన విస్లావత్ అనితగా గుర్తించారు. మహిళది హత్యనా, అత్యాచారం చేసి చంపేసారా అనే కోణంలో దేవునిపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.